కిరణ్ కు యువశక్తి పురస్కార్
కరీంనగర్ : ప్రతిష్టాత్మక భారతీయ యువ పురస్కారాన్ని నగరానికి చెందిన కిరణ్ కుమార్ స్వీకరించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 18న భువనేశ్వర్ లో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ ఎం ఎస్ గిల్, ఒరిస్సా సీ ఎం నవీన్ పట్నాయక్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిలు కలసి కిరణ్ కు ఈ అవార్డును ప్రదానం చేసారు. సామాజిక సేవల్లో విశేష సవేలందించినందుకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
News Posted: 18 January, 2010
|