వరంగల్ : భక్తుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి రాంరెడ్డి వంకట రెడ్డితో కలసి పొన్నాల సమ్మక్క- సారలమ్మ దర్శించుకున్న ఆనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక గిరిజన జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.