మరో ముగ్గురుకి తాఖీదులు
అనంతపురం : నగరంలోని రిలయన్స్ మాల్ పై దాడి, లూటీ కేసులో అధికారులకు, నాయకులకు మరింతగా ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు పోసీలు అధికారులపై వేటు పడగా, ఇపుడు తాజాగా మరో ముగ్గురు పోలీసు అధికారులకు తాఖీదులు అందాయి. కాంగ్రెస్ నేతలు ఎర్రిస్వామి రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, కోగటం విజయభాస్కర రెడ్డిలతో పాటు మరికొంత మంది నిందుతులను పట్టుకోకుంటే, పనిష్మెంట్ తప్పదని తాఖీదుల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు తెలిసింది.
News Posted: 18 January, 2010
|