మందుల కొరత లేదు
కడప : సీమ జిల్లాల్లో మందులకు ఎటువంటి కొరత లేదని వైద్యారోగ్య శాఖ రీజనల్ డైరక్టర్ మోహనరావు సస్పష్టం చేసారు. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. సీమ జిల్లాలకు 48 ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యయని, వాటికి కొత్తగా భవనాలు నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. వంద శాతం కుటుంబ నియంత్రణ లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News Posted: 21 January, 2010
|