మహాశివరాత్రికి ఏర్పాట్లు
కర్నూలు : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో మహాశివరాత్రిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం వేదపండితులు రవిశంకర అవధాని ఆధ్వర్యంలో స్తంభం పూజలు చేసారు. అలాగే చలువ పందుళ్ల వేసేందుకు తిరుపతికి చెందిన గుత్తేదారు సుబ్రహ్మణ్యం పనులు ప్రారంభించారు. ఆలయాల పరిధిలోని పంచలింగాల శివుని గదులు, మండపాలు సున్నపు పూతతో ముస్తాబయ్యాయి. దేవస్ధానం పాలకమండలి చైర్మన్ ఎన్ చిన్న మహానంది రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు.
News Posted: 21 January, 2010
|