వరంగల్ : జనగామ మండలం పెంబర్తి వద్ద బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజధాని హైదరాబాద్ నుండి వస్తున్న జీపునకు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అది బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ నగర వాసులుగా గుర్తించారు.