కాకినాడ : జిల్లాకు చేరుకున్న సైన్స్ ఎక్స్ ప్రెస్ కు రోజురోజుకు విశేషంగా ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ను చూసేందుకు తరలివస్తున్నారు. సోమవారం కాకినాడ కు వచ్చిన సైన్స్ ఎక్స్ ప్రెస్ ప్రదర్శనకు గురువారం చివరి రోజు కావడంతో సందర్శకు తాకిడి పెరిగింది. విద్యార్థల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దొహదపడతాయని జనవిజ్ఞాన వేదిక పేర్కొంది.