ఎన్ఎస్ఎస్ విశేష సేవలు
మేడారం : గిరిజన దేవతలు సమ్మక్క - సారలమ్మ జాతరలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేస్తున్న సేవలు భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాతరకు వచ్చే భక్తజన సంద్రానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో డిగ్రీ కళాశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు కెయు పరిధిలోని జాతీయ సేవా పథకం కో ఆర్డినేటర్ డాక్టర్ టి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ నెల 25 నుంచి సేవలు అందిస్తున్నారు.
భక్తులకు దారి చూపించడం, తప్పిపోయినవారిని ఆచూకీ తెలిపే కేంద్రాలకు తరలించడం, ప్రముఖులకు పోలీసులతో కలిసి సందర్శన ఏర్పాట్లు చేయడం ఇలా పలు విధాలుగా వారు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ముగిసే వరకూ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు కొనసాగుతాయని కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.
News Posted: 28 January, 2010
|