కరీంనగర్ : నాలుగు రోజులపాటు జరిగిన మేడారం జాతర ముగిసింది. సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర శనివారంతో ముగిసినట్లైంది. ఈ జాతరకు నాలుగు రోజుల్లో కోటి మంది భక్తులు హాజరైనట్లు కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఇంతమంది భక్తులు వచ్చినా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతర ప్రశాంతంగా ముగిసింది. అయితే చివర రోజున మధ్యాహ్నం మాత్రం స్వల్ప అపశ్రుతి దొర్లింది.