కలెక్టరేట్ ముట్టడి
కరీంనగర్ : ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపీఐ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించింది. సీపీఐ కార్యకర్తలు కలెక్టరేట్ ఆవరణలో టెంట్ లు వైసి తమ నిరసన తెలిపారు. అనుమతి లేకుండా వేసిన టెంట్ లను పోలీసులు తొలగించటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ అసమర్ధత వల్లే నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయన్నారు. కాంగ్రెస్ కపట నాటకం వల్లే రాష్ట్రంలో ప్రాంతీయ వాదాలు వినిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజ్యాంగ సంక్షోభం, డెడ్ లైన్లు ఆచరణ సాధ్యం కాదన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్టీలు అవకాశ వాదానికి పాల్పడుతున్నాయని నారాయణ ఆరోపించారు. తాడిచర్ల బొగ్గు గనులు ప్రైవేటు వారికి కట్టబెడితే సహించమని హెచ్చరించారు.
News Posted: 31 January, 2010
|