విదేశాలకు కీరదోశ
నిజామాబాద్ : జిల్లాలో రైతాంగం పెద్ద ఎత్తున పండిస్తున్న కీరదోశకు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. విదేశీయులను కీరదోశ రుచులు అకర్షిస్తుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో కీరదోశ పంట ప్రస్తుతం రైతన్నకు సిరులు కురిపిస్తోంది. విదేశాల్లో పచ్చళ్లు, సలాడ్స్, పిజ్జాలు, బర్గర్లు తయారీకి కీరదోశను విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీంతో కీరదోస ఆంధ్ర కీరదోశకు అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
News Posted: 2 February, 2010
|