వై ఎస్ విగ్రహావిష్కరణ
కడప : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని కడపలో బుధవారం ఆయన తనయుడు, ఎంపీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సాయి ప్రతాప్, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గల్లా అరుణకుమారి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి తదితరులు హాజరయ్యారు. వై ఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సర్వమత ప్రార్థనలు చేసారు.
News Posted: 3 February, 2010
|