కర్నూలు : నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రంగనాథ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన కార్మికుడైన రంగప్రసాద్ కుమారుడైన రంగనాథ్ ప్రేమ వైఫల్యంతో మనస్థాపం చెందాడు సహచర విద్యార్థులు తెలిపారు. రైలు పట్టాలుపై పడి రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు.