డిఎస్పీ విచారణ
జగ్గంపేట : జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహంతో పాటు మరో ఐదుగురుపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. మల్లిసాల దళితవాడలో ఈ మేరకు ఢీఎస్పీ హర్షవర్థన్ విచారణ జరిపారు. మల్లిసాలలో కమ్యూనిటీ హాలు కావాలని ఎమ్మెల్యేను నిలదీసినందుకు తమను కులం పేరుతో దూషించి అవమానపర్చారని ఆ ప్రాంత వాసులు తోట నరసింహంపై ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. దీంతో పోలీసులు విచారణను ఆరంభించారు.
News Posted: 8 February, 2010
|