పొలికేకపై కేసు నమోదు
వరంగల్ : ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా కాకతీయ వర్శిటీ విద్యార్థులు నిర్వహించిన పొలికేక రసాభాసగా ముగిసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు మూడు కేసులు పెట్టారు. పొలికేకలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై దాడి చేయడంపై ఓ కేసు, దేశపతి ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మరో కేసును నమోదు చేసారు. అంతేగాక హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేసారు
News Posted: 9 February, 2010
|