కర్నూలు : ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుతూ ఆందోళన చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు 20 తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. చట్టబద్దంగా రిజర్వేషన్ల ప్రవేశపెట్టి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.