రాజమండ్రి : శ్రీకృష్ణ కమిటీ ముందు రాజకీయ పార్టీలు అభిప్రాయాలను వెల్లడించాల్సి వస్తే ముందుగా ఎఐసిసి అధ్యక్షరాలు సోనియా గాంధీయే చప్పాలని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేసారు. కాంగ్రెస్ చెప్పిన తరువాత తాము చెబుతామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై మంత్రి బొత్స సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడినవని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. బొత్స బాధ్యతారాహిత్య ప్రకటనలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.