విజయవాడ : కృష్ణా జిల్లాలోని కునికిపాడు వద్ద సోమవారం ఉదయం ఓ స్కూలు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. అలాగే గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలంలోని భీమినేనివారిపాలెం సమీపంలో స్కూలు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరికి చికిత్స చేసేందుకు స్థానిక ఆసుపత్రికి తరలించారు.