విశాఖపట్నం : జిల్లా పోలీసులు మంగళవారం పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి మండలం సుంకరిమెట్ట జంక్షన్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు.