ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం ఐటీడీఏ పీఓ సుదర్శనం నివాసంపై ఏసీబీ అథికారులు దాడి చేసారు. జిల్లాలోని ఆచంటతో పాటుగా కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆయన నివాసాలపై బుధవారం ఏకకాలంలో దాడులు చేసారు. ఈ దాడుల్లో సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. సుదర్శన్ కు సింగపూర్ లో కూడా ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో సుదర్శన్ పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.