నెల్లూరు : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి ఎస్ ఎన్ ఎల్) సమాధాన్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం వినియోగదారులు ఫోన్ బిల్లు బకాయి పడితే దానిలో 50 శాతం రాయితీ కల్పిస్తారు. జిల్లాలో సుమారు రెండు కోట్ల రూపాయల మేరకు బకాయిలు పేరుకుపోవడంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసారు. బకాయిలో సగం మొత్తాన్ని తగ్గించడంతో సమాధాన్ ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.