|
|
Articles: Devotion | పంచగురుధామం - Mrs. seetha suri
| |
సద్గురు శ్రీ సాయినాధ్
ఒకప్పుడు ప్రతిష్ఠానపురము గా ప్రఖ్యాతి గాంచిన ఔరంగాబాద్ ప్రాంతమెంతో దివ్య శక్తియుక్తమైనది. కారణము ఇక్కడే సంత్ జ్ఞానేశ్వర్, ఏకనాధ్ మరియూ సమర్ధ రామదాస్ లాంటి మహా యోగులు నివసించి ధన్యులైరి. అజంత, ఎల్లోరా శిల్ప సముదాయములు అక్కడే విరాజిల్లుచున్నవి. చరిత్రలో ప్రఖ్యాతుడైన పురూరవ చక్రవర్తి పుడమిని ఖండఖండాలుగా చేసి శాసించింది ఇక్కడి నుంచే, అదియూ గాక సాక్షాత్తు పరమశివుని 12వ జ్యోతిర్లంగము అయిన ఘ్రుష్ణేశ్వరం ఉన్నది ఇక్కడే కదా. ఎక్కడ పరమపావనమైన పరమాత్ముని దివ్య నామము నిత్యము కీర్తింపబడునో అక్కడ దేవతలు కూడా స్థిరనివాసము ఏర్పరచుకొని నిలిచెదరు అన్నమాట సత్యము, అటువంటి భూమియే పరమ పవిత్రముగా కీర్తించబడును. అది నేడు మరియొకసారి ఋజువు చేయుటకై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ పరమాత్మ సచ్చిదానంద పావనమూర్తి సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ మహారాజు తన దివ్య చరణ స్పర్శతో పావనముగా చేసిన ప్రభవించిన భూమియే నేడు సాయినాధ టెక్డిగా రూపాంతరము చెంది విలశిల్లుచున్నది. ఈ భూమి ఔరంగబద్ పట్టణ శివారులలోని తూర్పు భాగమున నెలకొనిఉన్న దేవలియా మరియూ సింధొం బింధొం గ్రామముల మధ్య నున్న పర్వత శ్రేణులలొ నేటికిని ఆ సాయి దివ్యానుగ్రహనుగ్రహము వలన పదిలముగా పటిష్టముగా నున్నది.
పిలిచినంతనె పలికే సాయిబాబా తన భక్తుడైన కొండూరి కామేశ్వర రావునకు స్వప్నములొ సాక్షాత్కరించి తను ప్రప్రధమముగా ప్రకటనమైన నెలవు ఇంకనూ శూన్యముగా నున్నది. అక్కడ వెళ్ళి ఆ కూర్మ పీఠమును దర్శించి సద్భక్తులను భక్తిమార్గమ్ములో ప్రోత్సహించి నీ జన్మ సార్ధకత చేసుకొమ్మని సూచించెను. బాబా గారి ఆదేశానుసారము ఆ ప్రాంతమును తన మిత్రుడైన శ్రీనృసింహ సరస్వతి (జి. వెంకటరావు ప్రొఫెసర్ విశాఖపట్నం గారితో కలిసి ఔరంగాబాద్ కు వచ్చి బాబా చెప్పిన విధముగా ఆ ప్రాంతమును వెదికి సాధించిరి. అది మరకత పర్వతము. దేవగిరి కి తూర్పు భాగమున ఉన్నది. ఆ పర్వతము ఒక పక్క కైలాశ శిఖరము మరో ప్రక్క నందీశ్వరుని రూపు రేఖలతో ఉన్న పర్వతముల మధ్య అలరారుచున్నది ఆ పీఠము కూర్మ రూపమున వెలసి ఉన్నది. దానిపై బాబా ఆసీనుడై సుమారు 150 సంవత్సరములకు పూర్వము ప్రప్రధమముగ సద్గురు శ్రీ సాయి తన ప్రధమ భక్తుడైన చాందు పాటిల్ కి దర్శనమిచ్చి ధన్యునిగా చేసినాడు.
తనకు అత్యంత ప్ర్రీతి అయినటువంటి గుర్రపు జాడ తెలుసుకొనలేక ఖిన్నుడై పిచ్చివాని వలె గుర్రము కొరకై అన్వేషించుతూ ధూప్ ఖెడా గ్రామ మునసబు అయిన చాందు పాటిలు ఆ కూర్మ పీఠము వద్దకు వచ్చెను. అప్పుడు బాబా గుర్రపు జాడను తెలియచేయడమే కాక తన దివ్యత్వమును అక్కడ ప్రదర్శించినాడు. దీనికి పంచభూతములే సాక్షి. అందులో గాలి, భూమి, ఆకసము , అనునవి అన్నింట వ్యాపించి ఉన్నవి. కాని నీరు నిప్పు కొన్ని చోట్ల లోనె దర్సించ వీలగును. నీరు జ్యోతి స్వరూపము. నిప్పు శక్తి స్వరూపము . ఈ రెంటినీ సాయి తన సట్కా తో ఆ భూమిని స్రుజించి ఉద్భవింపగ చేసెను. వాటితోనె చాందు పాటిల్ కి చిలుము తయారు చేసి పీల్చుటకు ఇచ్చి సంబర పరిచెను. ఆ సంబరమును చూసి పరవసించిన చాందు పాటిలు సాయి కి నమస్కరించి తన అతిధ్యము స్వీకరించుటకై ఆ మహనుభావుని ప్రార్ధింప సాయి దివ్య మానసుడయి అతనితో దాపునే ఉన్న ధూప్ ఖెడ గ్రామమునకు తరలి వెళ్ళి అక్కడ 30 రోజులు మౌనిగ ఉండి ఆ పై చాందు పాటిల్తో కలిసి పెళ్ళి బృందముతో షిరిడికి మరలి చిరస్థాయిగా నిత్య నీరాజనములను భక్తులచే అందుకొనుచున్నాడు . అటువంటి పుణ్య ప్రదమైన మహిమాన్వితమైన కూర్మ పీఠమున స్థానికులైన సాయి భక్తులతో కలిసి స్తల నిర్ధారణ జరిగినంతనె తమ తో తెచ్చుకున్న యజ్ఞ సామాగ్రితో దత్త యజ్ఞము చేసి ధన్యులైరి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|