|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
(ప్రయోగాత్మక నాటిక-ఏకాంకిక)
రచన : డా. పెయ్యేటి మురళీ మోహనరావు (రాంరళి)
---అంకితం---
(జీవితాంతం తోడు నీడగా ఉండి, క్లిష్ట పరిస్థితుల్లో సవ్యమైన సలహాలిచ్చి, నా రచనా - నటనా, దర్శకత్వ విషయాల్లోనూ సూచనలిచ్చి నన్ను ధైర్యంగా ఎదరకు నడిపించిన నా సహధర్మచారిణి కీ.శే. శ్రీమతి రామలక్ష్మికి ఈ నాటికను ప్రేమ కానుకగా సమర్పిస్తున్నాను. నిజానికి ఈ కథా వస్తువూ శిల్పం ఆవిడ చెప్పినవే! ఆవిడ పేరును నా పేరుకు జోడించి నా కలం పేరు 'రాంరళి' గా రూపుదిద్దుకుంది అని పాఠకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను.)
[తెరతీయగానే రంగస్థలి చీకటిగా ఉంటుంది. Back curtain వద్ద తెల్లని తెరపై Silhoutte
పడుతుంది. అదో మనిషి నీడ! ఆ నీడే ప్రయోక్త! ఒక పుస్తకం తెరిచి చదువుతుంటాడు.]
సిల్ : ఒక మనవి!
ప్రపంచంలో ద్వివిధములైన రచనలుంటాయి. ఒక రకం రచనలు మనిషిని సక్రమ మార్గంలో ఉంచి ఋజువర్తనుడ్ని చేస్తే, మరొక రకం రచనలు మనిషిని వక్రమార్గంలో నడిపించి పతనానికి కారణభూతాలౌతాయి. అందుకే మనం చదివే రచనలు మనిషిని ఋజువర్తనుని చేసేవిగా ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్రయోజనాత్మకమైన నాటిక నాటక ప్రక్రియలో ఒక నూతన ప్రయోగం! పాఠకుడు ఒక నవలనుగానీ, నాటకాన్ని గానీ చదువుతున్నప్పుడు అందులో జరిగే సంఘటనలూ సన్నివేశాలూ అతని మనోఫలకంపై దృశ్యాలుగా అవతరిస్తాయి. ఆ సంఘటనలు తన కళ్ల ముందు జరుగుతున్నట్లుగా ఊహించుకోవడం సాథారణంగా ప్రతి పాఠకుడూ చేసే పనే! ఒక్కొక్కసారి పాఠకుడు కథలోని పాత్రలు - 'అలా చేసి ఉంటే బాగుండేది.., ఇలాగైతే బాగుండేది' అని స్వనిర్ణయం తీసుకుంటూ పాత్రలతో మాటాడేసుకోవటం కూడా పరిపాటే! అదేవిధంగా ఈ నాటిక అచ్చు ప్రతిని ఒక పాఠకుడు చదువుతూ మనస్సులో ఆ సన్నివేశాల్ని ఊహించుకుంటూంటే ఎలా ఉంటుందోనన్న జిజ్ఞాసకి రూపకల్పనే ఈ 'నరకానికి పూలదారి!'.
---ఇట్లు;
రచయిత.
(పేజీ త్రిప్పి) శ్రీ సోమనాథ్ కళా మందిర్, దగ్గులూరి వారి సమర్పణ :
'నరకానికి పూలదారి!?'
రచన : డాక్టర్ పెయ్యేటి మురళీ మోహనరావు (రాంరళి).
ఇందులో : చంచలరావు - చంచలమైన మనసు గలవానికి ప్రతీక, విశాలాక్షి - విశాల హృదయం ఉన్న గృహిణికి ప్రతీక, కమల - తిండికి లేక పడుపువృత్తి చేసే వేశ్యలకు ప్రతీక, సుశీల - చంచలరావు ఆఫీసులో గుమాస్తా భార్య, భర్త ప్రమోషన్ కోసం వ్యభిచరించేందుకు సిద్ధపడే మహిళలకు ప్రతీక, చంద్రం - తనకు తానుగా ప్రకాశించలేని తండ్రి చాటు బిడ్డ. పెద్దలను అనుకరించాలనుకునే లేమనసు బాలురకు ప్రతీక, గురవయ్య - మృత్యువు - అవినీతిపనులకూ.. ఏదో విధంగా డబ్బు సంపాధించాలనే దుర్మార్గపు ఆలోచనలు చేసే దుర్మార్గులకు ప్రతీక, అలాగే పాపభూయిష్టమైన పనులు చేసే వారికి అదే పాపం రూపంలో సాక్షాత్కరించే మృత్యువుకు ప్రతీక.
ఒక్క మాట!.. భారతదేశం తన పూర్వ సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోయి వెర్రితలలు వేస్తోంది. ప్రస్తుత సమాజంలో కొత్త నీరు అది బురద నీరైనప్పటికీ వస్తోంది. పాతనీరు పోతోంది. ఉరకలూ పరుగులూ వేస్తూ ఒడ్లను ఒరుసుకు పోయే సెలయేరులా నడిచిపోతోంది నవ నాగరికత! సమాజపు కట్టుబాట్లను తెంచుకుంటూ నవ్య సమాజం సాగిపోతోంది. పాతను దూరంగా తోసివేసి నవనీతను కోరి తెచ్చి పెట్టుకుంటున్నారు చాలా మంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|