|
|
Articles: TP Features | 'మావో' రాజ్యం అబూజ్ మఢ్ - Site Administrator
| |
(మధుసూదనరావు డి.)
భద్రతా యంత్రాంగం అత్యంత గోప్యంగా ఉంచిన ఒక విషయం దండకారణ్యంలోని మావోయిస్టు గెరిల్లాలకు శుభవార్తే. ఆ తిరుగుబాటుదారులకు స్థావరంగా ఉన్న, సువిశాల దండకారణ్యంలోని అబూజ్ మఢ్ ప్రాంతం కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలకు కొరుకుడు పడటం లేదన్నదే ఆ వార్త. దాన్ని స్వాధీనం చేసుకోవడం రోజుల్లోనో, నెలల్లోనో అయ్యే పని కాదని మావోయిస్టు నిరోధక చర్యల్లో పాల్గొంటున్న సాయుధ బలగాల అధిపతులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రహస్య నివేదికలో స్పష్టం చేశారని సమాచారం. బాహ్య ప్రపంచానికి ఎంతమాత్రం పరిచయం లేని కీకారణ్యం, ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ పట్టించుకోని మరో ప్రపంచం అని వారు వర్ణించారు.
రమారమి 50 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో బస్తర్ (ఛత్తీస్ గఢ్), గడ్చిరోలి (మహారాష్ట్ర), కరీంనగర్ (ఆంధ్రప్రదేశ్)లోని అటవీ ప్రాంతాలతో కూడిన మావోయిస్ట్ మిలిటరీ చర్యలకు పరోక్ష కేంద్రంగా ఉన్న అబూజ్ మఢ్ ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు చేరలేని ప్రదేశం మాత్రమే కాదు ప్రస్తుతం వారి లక్ష్యాలలో కూడా భాగంగా లేదు.
'అబూజ్ మఢ్ ను స్వాధీనం చేసుకోవడం సంగతి మరచిపోండి. అక్కడికి చేరడం కూడా ప్రస్తుతానికి మా అజెండాలో లేదు' అని ఛత్తీస్ గఢ్ లో మావోయిస్ట్ ఏరివేత పథకం 'గ్రీన్ హంట్'కు బాధ్యత వహిస్తున్న ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి చెప్పారు. 'మేము అందుకు సిద్ధంగా లేమంతే. ఈ పని పూర్తిచేసిన తరువాత అబూజ్ మఢ్ కోసం మరొక పోరు సాగించవలసి ఉంటుంది' అని ఆయన పేర్కొన్నారు.
అబూజ్ మఢ్ ప్రభుత్వానికి ప్రవేశించలేని ప్రాంతంగా ఉన్నది కేవలం మావోయిస్టులకు కోటగా ఉన్నందువల్లే కాదు. బాహ్య ప్రపంచానికి దాని గురించి తెలిసింది తక్కువే. దేశంలో ఎన్నడూ సర్వే జరగని ప్రాంతాలలో అబూజ్ మఢ్ ఒకటి. ఇందుకు భౌగోళిక సంబంధిత ఇబ్బందుల నుంచి గిరిజనుల రక్షణకు సంబంధించిన ఆందోళన వరకు రకరకాల కారణాలు ఉన్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|