|
|
Articles: Recipes | సేమ్యా కట్ లెట్ - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
సేమ్యా - రెండు కప్పులు
నీళ్ళు - 6 కప్పులు
బంగాళాదుంపలు - అర కేజీ
ఉల్లిపాయలు - పావు కేజీ
మైదా పిండి - అర కప్పు
అల్లం - చిన్నముక్క
కొత్తిమీర - ఒక కట్ట
నిమ్మరసం - రెండు టీస్పూన్స్
గరంమసాలా - రెండు టీస్పూన్స్
నూనె - 1 టీ స్పూన్
ఉప - తగినంత
పచ్చిమిర్చి - సరిపడా
తయారు చేయు విధానం :
ముందుగా బంగాళాదుంపలు ఉడకపెట్టాలి. తర్వాత దుంపలు చల్లారాక తొక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆరు కప్పుల నీటిని పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులోనే సేమ్యాను వేసి ఉడికించాలి. సేమ్యా ఉడికిన తరువాత నీటిని వార్చేసి విడిగా ఆరబెట్టాలి. అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకోవాలి. మైదాపిండిలో తగినంత ఉప్పువేసి మెత్తగా కలుపుకోవాలి. దీంట్లో బంగాళాదుంప ముద్ద, అల్లంపచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన సేమ్యా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్లెట్ల మాదిరిగా వత్తుకోవాలి. తర్వాత పెనం వేడెక్కినాక సేమ్యా కట్ లెట్ లను రెండువైపులా నూనె వేస్తూ ఎర్రగ వేయించుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్తో కలిపి తింటే టేస్టీగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|