|
|
Articles: TP Features | మహిళలకు భరోసా 'మనదేశీ' - Site Administrator
| |
(రమణి)
అర్చనా రసాల్... పదేళ్ళ క్రితం భర్తను పోగొట్టుకోవడంతో... సంసారాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కాలేదు. అయితే, ఆమె తన కథను అంతటితో ముగించుకోలేదు. తన కుటుంబానికి అలవాటైన వ్యవసాయాన్ని వీడి కొత్త పుంత తొక్కింది. వ్యాపారం వైపు అడుగు వేసింది. మహారాష్ట్రలోని కరవు పీడిత ప్రాతం - సతార జిల్లాలోని ఒక గ్రామీణ మహిళ జీవన పోరాటమిది. ఆమె సొంతంగా కుట్టు మిషన్ కొనాలని భావించింది. కానీ అందుకు సరిపడా నగదు ఆమె దగ్గర లేదు. అప్పుడు ఆమెను ఆదుకున్నది - మన దేశీ మహిళా సహకార బ్యాంక్!
కుట్టు మిషన్ కోసం ప్రయత్నించినప్పుడు అర్చనా రసాల్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అనేకసార్లు రుణాలు తీసుకున్నా తాను ప్రస్తుతం తొమ్మిది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. సొంతంగా టైలరింగ్ దుకాణం కోసం ఆమె తాజాగా 20 వేల రూపాయలు రుణం తీసుకున్నారు. వ్యాపారాన్ని విస్తరించిన ఆమె... కాస్మొటిక్స్ దుకాణం కూడా నడుపుతున్నారు!
తమ జీవితాలను తాము తీర్చిదిద్దుకున్న అతివల విజయగాధలకు కేంద్రంగా మహాస్వాద్ మారింది. అతివల స్వావలంబనకు విశేషంగా మన దేశీ మహిళా సహకార బ్యాంకు సహకరించింది. ప్రభుత్వేతర సంస్థగా 1994లో ప్రారంభమైన 'మన దేశీ మహిళ' సంస్థను చేతనా గాలా సిన్హా ప్రారంభించారు. బంగ్లాదేశ్ తరహాలో సూక్ష్మ రుణ బ్యాంకు (మైక్రో ఫైనాన్స్) నెలకొల్పాలని 'మన దేశీ' భావించింది. భారతదేశంలో ఏ వాణిజ్య బ్యాంకు కూడా ఖాతాదారునికి రుణంగా 100 రూపాయలు ఇవ్వదు. సూక్ష్మ రుణం అన్నది మాటలకే పరిమితమైంది. మన దేశీ మహిళా సహకార బ్యాంక్ ను 1997లోనే ప్రారంభించగా 2007లో పూర్తి స్థాయిలో సహకార బ్యాంక్ గా నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించింది.
పదేళ్ళ క్రితం చిన్న గ్రామంలో మొదలైన 'సూక్ష్మ రుణం' ప్రస్తుతం మహారాష్ట్రలో అనేక జిల్లాల్లో విస్తరించింది. సతారా, షోలాపూర్, సాంగ్లీ, రాయఘర్, రత్నగిరి, పూనే జిల్లాల్లో ఈ సహకార బ్యాంకు కార్యకలాపాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం 20 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయగా నాలుగు లక్షల నికర లాభం కనిపించింది. ఏడు శాఖలు, 100 మంది ఏజెంట్లు, 11వేల మంది సభ్యులు, 97 వేల మంది ఖాతాదారులతో రోజుకు ఏడు వేల కార్యకలాపాలను ఈ బ్యాంక్ నిర్వహిస్తోంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|