|
|
Articles: Recipes | సగ్గుబియ్యం కేసరి - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
నైలాన్ సగ్గుబియ్యం : కిలో
పంచదార : కిలో
మంచినీళ్ళు : లీటరు
నెయ్యి : పావు కిలో
జీడిపప్పు : 100 గ్రాములు
ఎండు ద్రాక్ష : 50 గ్రాములు
యాలకుల పొడి : చిటికెడు
కేసరి ఫుడ్ కలర్ : పావు టీ స్పూన్
తయారు చేయు విధానం : కిలో నైలాన్ సగ్గుబియ్యంలో ఒక లీటరు నీళ్ళుపోసి అందులోనే కేసరి కలర్ ఫుడ్ కలిపి ఓ గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నెలో కొంచెం నెయ్యి వేసి దానిలో నానిన సగ్గుబియ్యం, కొంచెం పాలు కాని నీళ్ళు కాని వేసి పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలి. మరో గిన్నెలో పంచదార వేసి దానిలో తగినన్ని నీళ్ళు పోసి పాకం రానిచ్చి యాలకులు పొడి వేసి ఉడికించిన సగ్గుబియ్యాన్ని వేసి కలుపుతూ మరి కొంచెం సేపు సిమ్ లో పెట్టి సగ్గుబియ్యం గట్టి పడే వరకు ఉడికించాలి. తర్వాత మరి కొంచెం నెయ్యి, వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి దించుకోవాలి. అంతే నోరూరించే సగ్గుబియ్యం కేసరి సిద్ధం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|