|
|
Articles: Recipes | రాజ్ మా పలావు - Site Administrator
| |
కావలసిన పదార్ధాలు
రాజ్ మా : ఒక కప్పు
బియ్యం : రెండు గ్లాసులు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : ఆరు
అల్లం,వెల్లుల్లి ఫేస్ట్ : ఒక టీ స్పూన్
కారం : ఒక టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
ధనియాలపొడి : అర టీ స్పూన్
గరంమసాలా : 2 గ్రాములు
టమోటాలు : రెండు
కొత్తిమీర ఒక కట్ట
నెయ్యి : నాలుగు టీ స్పూన్స్
ఉప్పు : తగినంత
తయారు చేయు విధానం : రాజ్ మా గింజలను అయిదు గంటలసేపు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని కాస్త ఉప్పు వేసి ఉడుకించుకోవాలి. బియ్యాన్ని కూడా కడిగి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణిలి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో గరంమసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాలపొడి, పుదీనా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు టామాటా ముక్కలు, ఉడికించుకున్న రాజ్ మా వేసి కలబెట్టి మరో అయిదు నిమిషాలు స్టవ్ మీద ఉంచితే కూర తయారవుతుంది.
ఒక పాత్రలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరగబెట్టి పొంగుతున్న సమయంలో నానబెట్టిన బియ్యాన్ని వేసి తగినంత ఉప్పు కలిపి మూత పెట్టాలి. మూడు వంతులు ఉడికిన తర్వాత అన్నాన్ని దించేసుకోవాలి. ఓ గిన్నెలో సగం అన్నాన్ని ఓ పొరలా వేయాలి. తర్వాత రాజ్ మా కూరను వేయాలి. తర్వాత మరలా మిగిలిన అన్నాన్ని వేసి స్టవ్ మీద పెట్టి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని రాజ్ మా పలావు తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|