|
|
Articles: Recipes | రసమలై - Ms. sandya arra
| |
కావలసిన పదార్ధాలు:
ఒక లీటర్ పాలు
రెండు కప్పుల పంచదార
యాభై గ్రాముల పచ్చి కోవా
చిటికెడు కుంకుమపువ్వు
తయారు చేసే విధానం :
ముందుగా పాలు బాగా కాగాక దానిలో రెండు నిమ్మ చుక్కలు పిండితే పాలు విరిగిపోతాయి. తరువాత ఒక సన్నటి క్లాత్ లో వడగట్టి గట్టిగా పిండి చల్లారాక దీనిలో పచ్చి కోవా కలిపి ఉండలుగా చేసుకొని చేతి మీద గారె మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పంచదార పాకం పట్టి దానిలో ఈ ఉండలను సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఇవి ఉడికే లోపు వేరే గిన్నెలో పాలు పోసి దానిలో ఒక సగం కప్పు పంచదార వేసి చిటికెడు కుంకుమపువ్వు వేసి పచ్చి కోవా వేసి చిక్కబడే వరకు మరగనివ్వాలి. తరువాత ఉడికిన ఈ ఉండలను చల్లారాక ఈ పాలలో వేసి ఫ్రిజ్ లో పెట్టి చల్లబడ్డాక తింటే ఎంతో బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|