|
|
Articles: Recipes | సీతాఫలంతో కీర్ - Ms. sandya arra
| |
కావలసిన పదార్ధాలు :
పిస్తా పప్పు : పది గ్రాములు
సీతాఫలాలు : ఒకటిన్నర కిలో
యాలకుల పొడి : ఐదు గ్రాములు
పంచదార : డెబ్బయి ఐదు గ్రాములు
పాలు : లీటరున్నర
బియ్యం : యాభై గ్రాములు
తయారు చేసే విధానం :
ముందుగా సీతాఫలాల్లో గింజలు తీసి గుజ్జును తయారు చేసుకోవాలి (ఇది ఒక్కటే ఇందులో కష్టమైన పని) బియ్యం కడిగి అరగంట సేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో పాలని సన్నని మంటపై వేడిచేస్తూ పంచదార, బియ్యం, సీతాఫలం గుజ్జును కలిపి అడుగంటకుండా నలభై ఐదు నిముషాలు ఉడికించాలి. దించే ముందు యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత చల్లారనిచ్చి పిస్తా పప్పుతో అలంకరించుకోవాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|