|
|
Articles: TP Features | పాస్ పోర్ట్ కష్టాలు - Site Administrator
| |
(యశోద)
విదేశాల్లో బంధువులను చూడాలన్నా, అక్కడ సంస్థల్లో ఉద్యోగం చేయాలన్నా ముందుగా కావలసింది - పాస్ పోర్ట్. రెండో ఆంధ్రప్రదేశ్ గా మారిన అమెరికాతో పాటు ఏ దేశం వెళ్ళాలన్నా కూడా పాస్ పోర్ట్ అత్యవసరం. వారంలోగా తత్కాల్ కింద పాస్ పోర్ట్ ను పొందవచ్చని ధీమాగా ఉంటే పప్పులో కాలేసినట్టే! నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా పాస్ పోర్టును మంజూరు చేయాల్సి ఉన్నా ఏడాది పైగా పాస్ పోర్ట్ కార్యలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దరఖాస్తుదారులు ఎందరో ఉన్నారు. హైదరాబాద్ లోని నగర పాస్ పోర్ట్ కార్యాలయంలో 5 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉంటే, ప్రాంతీయ కార్యాలయాల్లో 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
పాస్ పోర్ట్ కోసం ఏటా నాలుగు లక్షల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఫాతిమా గత ఏడాది ఏప్రిల్ లో దరఖాస్తు చేసినా ఇంతవరకూ పోలీసు అధికారుల తనిఖీ పూర్తి కాలేదు. మక్కా వెళ్ళాలని ఆశపడ్డ 80 ఏళ్ళ ఖయ్యూమ్ 2008 ఫిబ్రవరిలో దరఖాస్తు చేశాడు. ఎంతకూ పాస్ పోర్ట్ రాకపోవడంతో ఆయన చెన్నైలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పని పూర్తయ్యింది. ఇలా ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేయగలరు? ఈ వ్యయప్రయాసలను ఎంతమంది తట్టుకోగలరు.
పాస్ పోర్ట్ కార్యాలయంలో మీకు ఏ సమాచారం కావాలన్నా తెలిపే నాధుడు లేడు. పీ ఆర్ ఓ ఉన్నా తరచూ ప్రజలు ఆయనను సంప్రదించలేని పరిస్థితి ఉంది. ప్రతి బుధవారం నిర్వహించే 'అదాలత్'లో మాత్రమే దరఖాస్తు దారులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసినా స్పందించే పరిస్థితి అంతంతమాత్రమే. ఈ సేవ సెంటర్లలో దరఖాస్తులు కూడా డిమాండ్ కు సరిపడా లేవన్న ఆరోపణలున్నాయి. తత్కాల్ పధకం కింద అపాయింట్ మెంట్ ఏజెంట్లకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సమర్పించాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ మంజూరుకు అసవరమైన పోలీసుల తనిఖీ పూర్తి కావాలంటే 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ముట్ట చెబితే కానీ తనిఖీ పూర్తయ్యినట్టు కాదు. దరఖాస్తు దారునికి అనుకూలంగా నివేదిక అందుతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|