|
|
Articles: My Thoughts | 'పోర్టు' దగ్గరుండొద్దు - Dr. Srinivasa Rao Duggaraju
| |
విమానాల పట్ల పిల్లలకు ఆసక్తి అధికం. కాబట్టి విమానం దిగేటప్పుడు, లేచేటప్పుడు చూసేందుకు ఇష్టపడతారు. ఆ ఇష్టం వారి చెవులను విమానాశ్రయ ధ్వనివైపు తిప్పేలా చేస్తుంది. ఫలితంగా చిన్న వయసులోనే వినికిడి సమస్య తలెత్తుతుంది. విమానాల గోల చెవులలో గింగెరులెత్తిస్తుంది. ఆ గింగురులు విమానం లేకపోయినా వస్తూనే వుంటాయి. ఎక్కువ సమయం ధ్వని కాలుష్యానికి గురైనవారి చెవిలో రొద శాశ్వత సమస్యగా నిలుస్తుంది. నిద్రిస్తున్నా, మెలకువతో వున్నా ఆ సమస్య అలానే వుంటుంది.
ధ్వని కాలుష్యం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆదుర్దా అధికమవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా దేనిమీదా దృష్టి నిలవదు. పిల్లల్లో చదువు మీద శ్రద్ద తగ్గుతుంది. పరీక్షల్లో విఫలమవుతారు. వృద్ధులకు ధ్వని కాలుష్య సమస్య మరింత ఇబ్బందులు తెస్తుంది.
ఇవన్నీ ఊహాజనితమైన అంశాలు కాదు. ఢిల్లీ నగరంలో జరిగిన అధ్యయనంలో బయటపడిన వాస్తవాలు. ఢిల్లీలోని వసంతకుంజ్ ప్రాంతం విమానాశ్రయానికి దగ్గరగా వుంది. అక్కడ నివాసముంటున్న వారంతా నేడు మన రాజధానిలో 'ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి దగ్గరగా' అంటూ కనిపిస్తున్న ప్రకటనల వంటివి చూసి వెళ్ళి ఇరుక్కుపోయినవారే. అక్కడి కాలనీలోని పిల్లలకు చదువుమీద దృష్టిపెట్టడం కష్టంగా వుంది. తలనొప్పి సమస్యతో అన్ని సమయాలలో బాధపడుతున్నారు.
ఎయిర్ పోర్ట్ రన్ వేకి సమీపంలో వున్న కుంటుంబాల వారందరికీ అధిక ధ్వని అలవాటై గొంతు బాగా పెంచి మాట్లాడితే తప్పించి వినపడని స్థితి ఏర్పడింది. ధ్వని కాలుష్య సంబంధింత అనారోగ్యాలు పెరిగాయి. విమానాశ్రయ విస్తరణ పనులు జరుగుతున్నాయంటే అక్కడి ప్రజలు మరింత భయపడుతున్నారు. విమానాశ్రయాలు ఎక్కడ వున్నా యిదే సమస్య. ఆ సమస్య ఏర్పడటానికి కారణం విమానాశ్రయాలు మాత్రం కాదు. అవి వుండాల్సిన చోట వున్నాయి. సమస్యంతా ఆ విమానాశ్రయాల దగ్గర ఇళ్ళు కట్టుకునేందుకు వెళ్ళిన మనదే!
ధ్వని కాలుష్యం ప్రతిచోటా పెరుగుతున్నది. విమానాశ్రయ ప్రాంతాలలో ఇది అత్యధికం. ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే మనకు మనమే ముప్పు తెచ్చుకున్నట్లే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|