|
|
Articles: TP Features | మూడో ఫ్రంట్ తో ముప్పు - Site Administrator
| |
ఎన్ని ప్రభుత్వాలు మారినా 1994లో పి.వి.నర్సింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలే అనుసరిస్తూ రావడం వల్ల మార్కెట్ పైన ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడలేదనే చెప్పవచ్చు. మొన్న ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కూడా భారతీయ మార్కెట్లపైన దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపలేకపోయింది. మార్కెట్లు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అతివేగంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లలో ఉత్సాహం వచ్చింది. ఇదివరకు ఆగిపోయిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు గత నెలరోజులుగా తిరిగి వెల్లువెత్తడం మొదలయింది.
ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. పోలింగ్ కూడా పూర్తిపోయింది. ఎన్నికలకు ముందు 10 వేల పాయింట్లకు దిగువన ఉన్న సెన్సెక్స్ ఎన్నికల కారణంగా వెల్లువెత్తిన 10 వేల కోట్ల రూపాయల ప్రభావంతో 12,120 పాయింట్లకు చేరుకుంది. ఇంతవరకు గత ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు భారతీయ మార్కెట్ ను సమర్థవంతంగా ప్రభావం చేయగలిగాయనడానికి నిదర్శనం ఈ రోజు మార్కెట్ బుల్ కక్ష్యలోకి ప్రవేశించడమే.
అయితే ఇంతవరకు బాగానే సాగింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో తేలిపోయే ఘడియ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ సరేసరి. వారితో పాటు మార్కెట్ వర్గాల్లో కూడా ఆదుర్దా మొదలైంది. అన్ని సర్వేలు 'హంగ్' వస్తుందనే జోస్యం చెబుతుండడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దాంతో గత రెండు రోజులుగా భారతీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలకు ముందు ఏర్పడే ఒత్తిడే అయినప్పటికీ ఫలితాల తర్వాత మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి బేరీజు వేసుకోక తప్పదు.
ఇంతవరకు వెలువడిన వివిధ సర్వేల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికే మెజారిటీ వస్తుందని వెల్లడయింది. ఆ సర్వేల ప్రకారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ రాజస్థాన్ లలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మెజారిటీ లోక్ సభా స్థానాలను కైవసం చేసుకుంటాయన్న విషయం వెల్లడయింది. 543 లోక్ సభ స్థానాలకు గాను యుపిఎ దాదాపు 195 నుంచి 200 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అదే జరిగితే క్యాబినెట్ లో ఏదో కొద్దిపాటి మార్పులు తప్ప యుపిఎ ఇది వరకటి మంత్రివర్గమే యధావిధిగా కొనసాగుతుంది. ఆర్థికవేత్త మన్మోహన్ ప్రధాని, దేశీయ పెట్టుబడిదారులందరికీ సుపరిచితుడు, చిరపరిచితుడు. వారి తలలో నాలలక లాంటి చిదంబరం తిరిగి ఆర్థికమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యం. మన్మోహన్, చిదంబరం కాంబినేషన్ పట్ల కార్పొరేట్ రంగాల్లో అత్యంత సానుకూలత ఉంటుంది. మన్మోహన్ ఉదారవాద ఆర్థిక విధానాలు యధావిధిగా కొనసాగుతాయనడంలో సందేహం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|