|
|
Articles: TP Features | 'బాధిత భర్తల ఫోరం' - Site Administrator
| |
ఏఐఎండబ్యూఏ వ్యవస్థాపకుల్లో ఒకరైన టీఆర్ పార్థసారథి మాట్లాడుతూ, బాధితులకు సహాయపడేందుకు మూడు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. తాము ర్యాలీలు నిర్వహించిన తరువాత హెల్ప్ లైన్లకు నిరంతరం ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నారు. 'వేధింపులకు గురైన భర్తల నుంచి ఒక్కో ఫోన్ కు గతంలో 10 నుంచి 15 కాల్స్ వచ్చేవి. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్స్ సంఖ్య 30 నుంచి 40 కి పెరిగింది' అని వివరించారు.
గయ్యాళి 'గంగమ్మ'ల చేతుల్లో మానసిక చిత్రహింసలకు గురైన భర్తలు ఆత్మహత్యలకు పాల్పడకుండా 'కౌన్సెలింగ్' ఇస్తున్నారు. ఈ కౌన్సెలింగ్ సమావేశాల సంఖ్యను ఇటీవల పెంచారు. 'గృహహింసను ఎదుర్కొంటున్నప్పుడు మహిళలకు మాదిరిగానే మగవాళ్ళకు దు:ఖం కట్టలు తెంచుకుంటోంది, విపరీతంగా ఆగ్రహం వస్తుంది. కానీ అందరూ అతివల పక్షమే. మగవారి మొర వినే నాథులే కరవయ్యారు' అని ఏఐఎండబ్ల్యూఏ సభ్యుడు మహ్మద్ జలీల్ తెలిపారు. 'తననెలా తప్పుడు కేసులో ఇరికించిందీ, వేధించిందీ చెప్పినప్పుడు... తనను పిచ్చివాడుగా ప్రజలు చూశారు. భార్యను వేధించిన వైనాన్ని 'కవర్' చేసుకోవడానికి ఇదంతా చెబుతున్నానని అనుకున్నారు. నేనేం చెప్పినా ఎవరూ విశ్వసించలేదు' అని వివరించారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... మహిళలను అత్తలు వేధించిన విధంగానే... పురుష పుంగవులు కూడా అత్తల వేధింపులను ఎదుర్కొంటున్నారు. తమను 'ఇల్లరికపు అల్లుళ్ళు'గా రావాలని కొందరు అత్తలు వేధిస్తే... మరి కొందరు అత్తలు... కేసులు కూడా పెట్టకుండా పోలీసు దెబ్బలు అల్లుళ్ళకు రుచి చూపించారని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద... మహిళల వేధింపుల కేసుల్లోనూ... పురుషుల ఇక్కట్ల కేసుల్లోనూ విలన్లు మాత్రం అత్తమ్మలే కావడం గమనార్హం!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|