|
|
Articles: Devotion | సీతాదేవి శాపం - Miss rajeswari rajeswarinedunuri
| |
అందులకు సీత సంతోషపడి 'ఓ మహాత్మా! నేను ధన్యు రాలను కానీ ఇట్టి సంఘటన మున్నెన్నడును ఎవరు విన్నది, కన్నదీ కాదు. నేనిట్లొనరించిన పిండ ప్రదానమును చేజేతుల మీరు పరిగ్రహించితిరి. కావున మరి శ్రీ రామ చంద్రుడెట్లు నమ్మగలడు? అందులకు సాక్ష్యమేమి గలదు? తామే సెలవీయ గలరు' అని వినయము గా వేడుకొనెను.
అందులకు దశరధుడు 'కోడలా! ఈ విషయము సత్యేతరము గాదని రూఢిగా పల్కుటకు కొందరి నెవరి నైనా ఏర్పాటు జేయుమనెను'
అప్పుడు సీతాదేవి 'ఫల్గుణీ నదినీ, సమీపములో మేత మేయుచున్న గోవును, అగ్ని దేవునీ, మొగలి పువ్వును సాక్ష మిచ్చుటకు ఆధారముగా చేసుకొంటినని పల్కెను. అంతట పితృదేవతలు అంతర్ధాన మొందిరి.
ఇదంతయు జరిగిన పిమ్మట రామ లక్ష్మణులు శ్రాద్ధమునకు కావలసిన దినుసులు గైకొని వచ్చిరి. వెను వెంటనే శ్రీరాముడు సీతను గాంచి 'దేవీ! ఇప్పటికే కాలతీత మైనది. కాలాతిక్రమణ దోషము ఆపాదించకుండు నట్లు నీవు త్వరిత గతిని స్నాన మాచరించి తద్దినపు వంట త్వరిత గతిని సిద్ధము చేయుమని ఆజ్ఞా పించెను.
అందులకు సీతాదేవి చిరు నగవుతో జరిగిన దంతయు వినయముతో వివరించెను. అంతయు విన్న రామునకు నమ్మశక్యము గాక వింతగా దోచెను. లక్ష్మణుని గాంచి సోదరా! ఇది ఏమి వింత? మంత్ర తంత్ర ములతో ఆబ్దీకమును విధి విధానముగా నొనరించుట కొడుకులకు విధ్యుక్త ధర్మముగదా! పుత్రులు శ్రద్ధా భక్తులతో శ్రాద్ధ కర్మలు నిర్వహించి పితృదేవతలను సంతుష్టులను జేయుట లోక సహజము కదా! మరి కోడలు తద్దినము పెట్టుట పెద్దలు చేజేతుల అందుకొని భుజించుట వింతగా నున్నదే? లోకా తీతము గదా?' అని తన సందేహమును వ్యక్త పరచెను. అంతే కాదు కాలా తీత మైనందున ఆమె శ్రమ కోర్వ జాలక అట్లు పలుకు చున్నదేమో అన్న అనుమానముతో సూటిగా మరల ప్రశ్నించెను.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|