|
|
Articles: TP Features | మృతజాతిగా మిగిలిపోదామా? - Site Administrator
| |
బడికీ, గుడికీ, బ్రతుక్కీ, చావుకూ, పెళ్లికీ - ఏ సందర్భంలోనూ పనికిరాని భాషగా మా తల్లిభాషను పనికిరానిదిగా, అంటరానిదిగా చేసి, ఆ అంటరాని భాషలోనే - అదీ అర్థం కానంత సంస్కృతమయం అయిన, ఆ భాషలోనే మా పిల్ల్ని చదువుకోమనడంలో `అసలు సంగతి ఏమిటి' అని సామాన్యులు అడుగుతున్నారు. వీటన్నింటికీ తెలుగుభాషోద్యమం పరిష్కారాలు చూపాలి. అంటే - ఇదొక దీర్ఘకాలిక కార్యక్రమం. మహోన్నతాశయాలతో, అవగాహనతో, క్లిష్టాతిక్లిష్టమైన - వేలాది సంవత్సరాలుగా పేరుకొని ఉన్న సామాజిక రుగ్మతలతో బందీ అయిన తెలుగును విడిపించి, మహోత్సాహంతో ముందుకు నడుపవలసిన కార్యక్రమం. అందుకే సమస్యల సమగ్ర అవగాహనతో ఉద్యమాలు సాగాలి.
నేటి భాషోద్యమం పండితులకు పరిమితం కాదు. సామాన్య ప్రజల కోసం, ప్రజాస్వామ్య విలువలకు ఆధారంగా తీర్చిదిద్దవలసినట్టిది. ఒక శక్తివంతమైన తెలుగు సమాజ నిర్మాణం కోసం ఈ ఉద్యమాలు నడవాలి. మన ఆలోచనలను ఈ దిశగా సాగించాలి. ఇందుకు తోడ్పడే రచనలు వివిధ సాహిత్య ప్రక్రియల్లో రావాలి. పాఠ్య పుస్తకాలను ఇందుకు తగ్గట్లు రూపకల్పన చెయ్యాలి. అన్ని రంగాల్లో తెలుగు పోటీ పడగిలితేనే తెలుగుజాతికి భవిష్యత్తు. తల్లిభాషను చంపుకొన్న తర్వాత ఒక భాషాజాతిగా మనకు గౌరవం లభిస్తుందనుకోవడం కంటే తెలివితక్కువతనం వేరే ఉండదు.
తెలుగుభాష, తెలుగుజాతి అనేక తరాలుగా అనేక సామాజిక దుర్మార్గాలకు బలి అయింది. అందుకే తెలుగు భాషోద్యమ పతాకగీతంలో - ఓ తెలుగు పతాకమా! ఒక్కో తరం ఒక్కో తరం ఎంత నలిగిపొయ్యావో, ఏ చీకటి దుమ్ములో ఎంత మాసిపొయ్యావో... అంటూ చారిత్రక పరిణామాలను ఎత్తిచూపుతూనే - `నీ ఏపుకు అడ్డమైన ప్రతికంపను పెళ్లగించి, జనం బ్రతుకు మలుపుల్లో ఏరువాక పొంగిస్తాం' అని ప్రకటించారు. తెలుగు పతాకాన్ని, అదే... మన జాతి పతాకాన్ని... మా గుండెల ఊపిరిపోసి... ఎగరేస్తాం మళ్ళీ పైపైకి... అది దృఢమైన సంకల్పాన్నీ ప్రకటించారు.
ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీళ్ళు ప్రజలు మాట విని తీరాలి. ప్రజలకు తమ అవసరాలను - అంటే జాతి అవసరాలు అర్థం కావాలి. ఇదంతా మన కోసమేనని నమ్మకం కలగాలి. అపనమ్మకాన్ని పోగొట్టగలిగితే - పట్టనితనమూ పోతుంది, పట్టుదలా వస్తుంది.
జై తెలుగు జాతి, జై తెలుగు తల్లి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|