|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా బ్రాహ్మణులకే విద్యాసౌకర్యాలు కల్పించడానికి ఉత్సాహం చూపేది. కాలక్రమేణా మార్పు వచ్చి శూద్రులకు, అతిశూద్రులకు స్థానం కల్పించారు. దాంతో బ్రాహ్మణులు పాఠశాలలకు వారి పిల్లల్ని పంపడం మానివేస్తామని బెదరించడం కూడా జరిగింది. ఉపాధ్యాయులు బ్రాహ్మణులే ఉండేవారు. విద్య నేర్పడంలో వివక్ష ఉండేది.
బ్రాహ్మణులు ఏ విధంగా మతాన్ని స్వార్థానికి వాడుకుంటారో జోతిరావుకు తెలియడానికి రెండు సంఘటనలు జరిగాయి. నారాయణ శేషాద్రి అనే ఒక బ్రాహ్మణుడు క్రిష్టియన్ మతం తీసుకున్నాడు. అతనితో కలిసి అతని తమ్ముడు శ్రీపత్ కూడా ఉండేవాడు. వాళ్ళ తండ్రి శ్రీపత్ ను తనతో వచ్చేయమన్నాడు. అప్పటి బొంబాయి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కాని క్రిష్టియన్ తో నివసించిన శ్రీపత్ ను తిరిగి హిందువుగా తీసుకోవడం ఎలా అని సందేహమొచ్చింది. బ్రాహ్మణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఉదారవాద బ్రాహ్మణవర్గ నాయకుడు చనిపోతే అతని చావుకు శ్రీపత్ ను హిందువుగా తీసుకోవాలన్న నిర్ణయమే కారణమన్నారు. 1851 మే 25న కలకత్తా సమావేశంలో బ్రాహ్మణేతర ఆహారం తిన్న బ్రాహ్మణుడికి పరిహారమేమిటన్న సమస్యకి ఒక బ్రాహ్మణుడికి వంద ఆవులిస్తే సరిపోతుందన్నారు. ఒక అస్పృశ్య స్త్రీతో నివాసమున్న పూనా బ్రాహ్మణుడు ఎక్కువ పరిహారమిస్తే తిరిగి కులంలో కలుపుకున్నారు. ఈ సంఘటనలన్నీ జోతిరావులో ఆలోచనలు రేపాయి. బ్రాహ్మణత్వానికి, పూజా విధానానికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నాడు. సత్యనారాయణవ్రతం కూడా బ్రాహ్మణుల సృష్టేనని పోటీగా ఒక నాటకాన్ని రచించాడు. జోతిరావు పనుల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఇద్దరు బ్రాహ్మణులు శూద్రుల్ని అతనిని చంపడానికి ప్రయోగించారు. వారు ఇంటిలో ప్రవేశించినపుడు అలికిడికి నిద్రలో ఉన్న జోతిరావురావుకు మెలకువ వచ్చింది. తనను చంపితే వారికి లాభం వస్తే చంపమన్నాడు. వారిలో పరివర్తన వచ్చింది. వారు తిరిగి జోతిరావును చంపమన్నవారిని చంపడానికి అనుమతి కోరారు. కాని, వాళ్ళను క్షమించమన్నాడు. ఆ ఇద్దరు శూద్రులలో ఒకతను తన దగ్గర చదువుకొని పండితుడయ్యాడు. మరొకతను ఆయన అంగరక్షకుడు అయ్యాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|