|
|
Articles: TP Features | 'బ్రహ్మాండ' సంపన్నుడు - Site Administrator
| |
స్వామి వారికి తన కుమార్తె పద్మావతీదేవిని ఇచ్చి కన్యాదానం చేస్తూ ఆకాశరాజు బహూకరించిన వజ్ర వైఢుర్యాలతో పొదిగిన స్వర్ణకిరీటం మొదటిది. దీని బరువు 9 కేజీల 750 గ్రాములు. 1986లో 5 కోట్ల రూపాయలతో టీటీడీ చేయించిన 13 కిలోల వజ్ర కిరీటం. గోయెంకా గ్రూప్ సంస్థ 10 కిలోల బంగారంతో చేయించిన మరో వజ్ర కిరీటం స్వామికి ఉన్నాయి. అజ్ఞాత భక్తుడు 20 కిలోల బంగారంతో చేయించిన వజ్ర కిరీటం. శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఈ ఏడాది జూన్ 12న ప్రముఖ పారిశ్రామిక వేత్త, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 34.8 కేజీల స్వర్ణ కిరీటాన్ని అందించారు. 35,700 వజ్రాలతో పాటు ఆఫ్రికా నుంచి తెప్పించిన 819 క్యారెట్ల పచ్చను పొందుపర్చి ఈ కిరీటాన్ని తయారు చేయించారు. మరో అజ్ఞాత భక్తుడు బహూకరించిన 13 కిలోల బంగారంతో వజ్రాలు పొదిగిన కిరీటం స్వామివారి సేవల్లో వినియోగిస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఉన్న వజ్ర వైఢుర్యాలలో శ్రీ కృష్ణదేవరాయలు ఏడుసార్లు స్వామిని దర్శించుకుని సమర్పించిన వెలలేని రత్నఖచిత వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణాభరణాలున్నాయి. అందులో 3.5 కిలోల బరువున్న పచ్చ ఆభరణం అందులో ఒకటి. వీటి వెల కట్టడం సాధ్యం కాదు. 1998లో శ్రీలంకకు చెందిన ఓ భక్తుడు ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిలకు సమర్పించిన మూడు వజ్ర కిరీటాలు, బల్బీర్ సింఘ్ ఉత్పల్ అనే భక్తుడు సమర్పించిన 15.5 కిలోల ఆభరణాలు తిరుమల దేవునికి ఉన్నాయి. వెయ్యి కాసుల సహస్ర లక్ష్మీదేవి స్వర్ణహారం, మైసూరు మహారాజు 32 కేజీల బంగారంతో చేయించిన 108 బంగారు పుష్పాల హారం, గద్వాల మహారాణి సమర్పించిన వజ్ర కిరీటం, గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుసేన్ సాహెబ్ అనే ముస్లిం భక్తుడు స్వామివారికి 108 బంగారు పువ్వులు స్వామివారి విలువైన ఆస్తులుగా ఉన్నాయి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|