|
|
Articles: TP Features | అందరికీ అన్నదాతే లోకువ! - Site Administrator
| |
నిజమే! పూట గడవడం కష్టమై... అప్పు తీరే దారి లేక... తాను పోయినా...మిగిలిన కుటుంబం బతుకుతుందని... ప్రాణాన్ని పణంగా పెట్టిన రైతుల 'త్యాగాన్ని' ఇక్కడ గుర్తించాలి. నిజానికి రైతు ఎగ్గొట్టాలని అప్పు చేయడు. ఆ వర్గం వేరే ఉంది! పంట పండితే అప్పు తీరుద్దామనే రైతు అనుకుంటాడు. కాలం కలిసి రాకే మెడకు ఉరి వేసుకుంటున్నాడు.
రైతు కష్టం తీర్చడానికి ముఖ్యంగా సాగునీరు అందించడం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచడం వంటివి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలకు కార్పొరేట్ సంస్థలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు. పైగా సహకార సేద్యం పేరిట రైతును భూమి నుంచి తరిమేయబోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పార్లమెంటు సభ్యుల్లో, శాసనసభ్యుల్లో కనీసం 70 శాతం మంది సేద్యపు వర్గానికి చెందినవారే! కానీ వారికి ఇతరత్రా పనుల పట్ల ఉన్న ఆసక్తి రైతు శ్రేయస్సుపై లోపించింది. చట్టసభల్లో ఇప్పుడు రైతు సమస్యల్ని ప్రస్తావించేందుకు రైతు పక్షపాతులు చరణ్ సింగ్, ఎన్ జి రంగా, గౌతు లచ్చన్న వంటి వారు కూడా లేరు. చట్టసభల వెలుపల కూడా రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేడు. రైతు సాగుతీరు మూడు అప్పులు, ఆరు వడ్డీలు గా మిగిలిపోతోంది. చివరికి ఉరితాళ్ళే రైతులకు కంఠాభరణాలు అవుతున్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|