|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
ఇలా దూరం కావడం ప్రజల తప్పు కాదు. దశాబ్దాల నుండి అలా వారిని వారికి కేటాయించిన మూలల్లోనే ఉంచే వ్యవస్థీకృత ప్రణాళికది తప్పు. దానిని నిరంతరం పాటించే ధనస్వామ్యం కుట్ర ఇది. ప్రజలకు దేశభక్తిలో భాగం కల్పించడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేసినట్లే అవుతుందని, అందువల్ల వారిని దూరం ఉంచడమే మేలని శిష్టులు భావిస్తారు. ప్రజలకి దేశభక్తి లేకపోయినా ఫరవాలేదు. వారి పాత్రని మాత్రం ముందుకు రానివ్వకూడదనేది అభిమతం. అంటే ఉత్పత్తిరంగంలో ప్రజలను సేవకుల వలెనే ఉంచాలి. ఉత్పత్తిలో వారు భాగం అనే భావనని కలిగించకూడదు. ఫ్యాక్టరీలు నడవాలి. కాని దాని లాభాల మీద వారికే మాత్రం సంబంధం ఉండకూడదు. సమ్మెలకి, గొడవలకి ఆస్కారం ఉంటుంది. అటు ప్రభుత్వం ఇటు ప్రైవేటు రంగం ఉత్పత్తికి సంబంధించిన కర్మాగారాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి.
ప్రస్తుతం ఒక వ్యవసాయ రంగోత్పత్తిలో మాత్రమే ప్రజలకు స్థానం ఉంది. ఆ రంగాన్ని కూడా - అంటే ముఖ్యంగా భూమిని వారి నుండి దూరం చేయగలిగితే ఇక వారి నుండి డిమాండులు ఉండవు. సబ్సిడీలు, లాభాలలో వాటాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ ఆలోచనలకు దేశీయ ధనికవర్గం ఎప్పటి నుండో ఒక రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దీనికి వేగవంతమైన ఊతం ఇవ్వడానికి రూపకల్పన చేసింది ప్రపంచబ్యాంకు. దాని మార్గదర్శకాలకు సమ్మతించడమే ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు. అది సింగరేణి కావచ్చు. పాపికొండల అంతర్థానం కావచ్చు. జిందాల్ కర్మాగారం కింద మూలిగే గిరిజనం కావచ్చు. నూటొక్క సెజ్ లు కావచ్చు. పండే వ్యవసాయ భూముల సహకారం కావచ్చు.
కొత్త ప్రణాళికలు, నవ్య పథక రచనలు, నవీన సాంకేతిక అభివృద్ధి వంటి వాటిలో ప్రజల బతుకులు ఏమంటున్నాయి. వీళ్ళలో దేశభక్తి భావన కలిగించడం ఎలా అని ఆలోచించక మత భావనకే దేశభక్తి ముసుగువేసే పథకాలు కూడా మోళీలాడుతున్నాయి.
తెలుగువారం బెంగాలీ, మరాఠా, తమిళుల వలె జాతీయతని కొంతైనా ఎలా నిలుపుకోగలం.
జాతి అంటే దేశం, ఉపజాతి అంటే రాష్ట్రం, ఇటువంటి పలు పొరల మధ్య ఈనాడు జాతీయతల గురించి ఆలోచించడం సబబేనా? భారతదేశానికి ఎలాంటి నమూనా కావాలి?
నిజానికి దేశభక్తి భావన అవసరం లేదని అంటారా? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తారు.
అందుకు ఉంది అనే సమాధానం చెప్పాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|