|
|
Articles: My Thoughts | ఐవిఎస్ అవిరళ కృషి - Site Administrator
| |
వివిధ ప్రాజెక్టులను వీరి ఆధ్వర్యంలో శిష్యగణం పూర్తి చేసారు. వాటిలో కొన్ని - స్పీచ్ సింథసిస్ (మలయాళం) యాన్ అప్లికేషన్ ఫర్ ది బ్లైండ్ అండ్ స్పీచ్ అవుట్ పుట్ ఫర్ మెషిన్ ట్రాన్స్ లేషన్, స్పీచ్ సింథసిస్ - (తమిళం - ఒరియ)యాన్ అప్లికేషన్ ఫర్ ది బ్లైండ్ స్పీచ్ అవుట్ పుట్ ఫర్ మెషీన్ ట్రాన్స్ లేషన్, 'ఆక్షన్ రిసర్చ్ కవరింగ్ లింగ్విస్టిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లాంగ్వేజి డిస్ ఆర్డర్స్ ఇన్ ప్రీ - ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ (4-6) అమాంగ్ సోషియల్లీ డిప్రూవ్డ్ కమ్యూనిటీ అండ్ కరికులమ్ డెవలప్ మెంట్' వంటివి భారత స్త్రీ-శిశు సంరక్షణ శాఖ కోసం చేసినవి. భాషా శాస్త్రాన్ని కేవల శాస్త్రంగా అభ్యసించకుండా దాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్న వీరి భావనే ఇటువంటి ప్రాజెక్టులకు నాంది పలికింది. విద్యారంగంలో ఇవి సమున్నత మార్పులకు తొలిమెట్టులయ్యాయి.
గొప్ప భాషా శాస్త్రవేత్తగా, మంచి అధ్యాపకునిగా ప్రాచార్య వి.ఐ.సుబ్రహ్మణ్యంగారు తమిళ విశ్వవిద్యాలయానికి తొలి వ్యవస్థాపక ఉపకులపతిగా ఆరు సంవత్సరాల పాటు వ్యవహరించారు. వీరి దార్శనికతవల్ల, వీరిచేతిలో ఆ విశ్వవిద్యాలయం భాషా సంబంధి విశ్వవిద్యాలయాలు ఎలా రూపుదిద్దుకోవాలో చెప్పే నమూనాగా తయారయింది. దక్షిణ భారతదేశంలో భాష - సంస్కృతి అధ్యయనానికి పెద్దపీట వేసిన తొలి విశ్వవిద్యాలయం ఇదే! ఇది వారి దూరదృష్టికి నిదర్శనం. భాష, తద్వారా సంస్కృతి పరిరక్షించబడాలి. ఒక జాతి సమస్త పురోభివృద్ధికి మూలాధారం భాష.
ప్రాచార్య విఐ సుబ్రహ్మణ్యంగారు భాషా శాస్త్రాధ్యయనాన్ని సంస్థాగతం చేయడమే కాదు, తమిళ భాషా వ్యవహర్త, భాషా శాస్త్రజ్ఞుడు అయినా కూడా తెలుగు భాషా శాస్త్రాధ్యయనంమీద మక్కువ ఉన్నవారు. నాలుగు ప్రధాన ద్రావిడ భాషలకు సంబంధించిన విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్నప్పుడు అది కేరళలోనో, తమిళనాడులోనో జరగాలన్న భావనను ఎందరో వ్యక్తపరిచారు. కానీ, మూడు భాషల సంగమస్థానమైన కుప్పంలో విశ్వవిద్యాలయ రూపకల్పన జరగాలని సూచించి, ఛాన్సలర్ గా కూడా వ్యవహరించారు. తెలుగునాట తెలుగుభాషా సంస్కృతులకు తగిన చోటు కల్పిస్తూ, లిపిలేని ద్రావిడ భాషల మౌఖిక వాఙ్మయ సంస్కృతులకు పరిరక్షణ కల్పించటానికి నెలకొల్పబడ్డ ద్రావిడ విశ్వవిద్యాలయం రూపకల్పనలో వీరిది కూడా ప్రధానపాత్ర.
ఒక జాతి ప్రజల నాగరికతాభివృద్ధికి, ఆలోచనల సమున్నత స్థాయికి అద్దం భాష. భాషాధ్యయనం సంస్కృతి అధ్యయనానికి నాంది అన్న విషయాన్ని గుర్తించి భాషాశాస్త్రాధ్యయనాన్ని సంస్థాగతం చేసినవారు కీర్తిశేషులు ప్రాచార్య విఐ సుబ్రహ్మణ్యం గారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|