|
|
Articles: TP Features | కర్త, కర్మ, క్రియ కేసీయారే - Site Administrator
| |
రెండోసారి జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని నివారించడానికి మేధావులు, రచయితలతో మాట్లాడతానని కెసిఆర్ చెప్పారు. కానీ అప్పుడు కూడా ఆ నలుగురైదుగురినే తప్ప మొదటి నుంచి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలను నడుపుతున్న వారికి, తెలంగాణ ఉద్యమానికి ఒక సైద్ధాంతిక ఉద్యమాలను నడుపుతున్న వారికి, తెలంగాణ ఉద్యమానికి ఒక సైద్ధాంతిక భూమికను అందించిన వారిని పట్టించుకోలేదు. కెసిఆర్ వైఖరి వల్ల పీరు లేవదూ, ఊదు కాలదు అనే ఒక బలమైన అభిప్రాయానికి తెలంగాణ మేధావులు వచ్చారు. దీంతో గ్రామీణ పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో లింక్ తెగిపోయింది.
బలమైన తటస్థ మేధావుల పాత్ర మరుగున పడిపోవడం, ఉద్యమాలతో సంబంధం లేని వారికి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం, పార్టీలో కెసిఆర్ కుటుంబ సభ్యుల పాత్ర పెరిగిపోవడం, ఆయన మరింత ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ రావడం, తెలంగాణ ప్రజలకు తాను తప్ప మరొకరు దిక్కు లేరనే అతి విశ్వాసానికి కెసిఆర్ లోనుకావడం, ఉద్యమాలతో సంబంధంలేని వారిని పక్కన పెట్టుకుంటే వారికి నిబద్ధత ఉండదనే విషయాన్ని గమనించకపోవడం, ఈ సారి ఎన్నికల్లో ఎంపిక చేసుకున్న సీట్ల తీరు - అన్నీ కలిసి తెరాస ఘోర వైఫల్యానికి పాదులు చేశాయి. దీనికంతటికీ కారణం కెసిఆర్ తప్ప మరొకరు కారణం కాదు. ఉద్యమం తన వల్ల నడపడం లేదని, ప్రజల వల్ల నడుస్తోందని, ఆ ఉద్యమం కారణంగానే తెరాస విజయం సాధిస్తూ వస్తోందని ఆయన నమ్మేందుకు సిద్ధంగా లేరు. అదే ఆయన ప్రస్తుత దీనమైన స్థితికి కారణంగా చెప్పవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|