|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమనే తిరుగుబాటు జరిగిందని మనకు తెలుసు. ఆ తిరుగుబాటు విఫలమవ్వడం జోతిరావుకు ఊరటనిచ్చింది. అది సఫలమయ్యుంటే బ్రాహ్మణ రాజ్యం ఏర్పడేదని ఆయన భయం. బ్రిటీషు రాజ్యం కలకాలం ఉండదని ఊహించాడు. ఈ లోపుగా శూద్రులు, అతి శూద్రులు విద్యాజ్ఞానాన్ని పొందవచ్చనుకున్నాడు. బ్రాహ్మణుల రాజ్యం నుండి విముక్తి కావచ్చు అనుకున్నాడు. అలా అని పరాయి ప్రభుత్వానికి వత్తాసు పలకలేదు.
విధవా పునర్వివాహ ఉద్యమం బ్రాహ్మణులకు, మిగిలిన అగ్రవర్ణాలకు చెందినదైనా జోతిరావు తన మద్దతు తెలిపాడు. `ఇక్కడకొచ్చి క్షేమంగా రహస్యంగా ప్రసవించండి. కావాలంటే పిల్లల్ని తీసుకెళ్ళండి. లేకపోతే ఇక్కడ వదలండి. మా అనాథ శరణాలయం వాళ్ళని చూసుకుంటుంది' అని ఒక కరపత్రాన్ని ప్రచురించాడు. జోతిరావుకు పిల్లలు కలగకపోవడంతో మరలా వివాహం చేసుకోమని తన తండ్రి ఒత్తిడి చేస్తే, పిల్లలు కలగకపోవడానికి స్త్రీ ఒక్కతే కారణం కాదని ఆ కారణం మీద రెండవ వివాహం అర్థం లేనిదన్నాడు. బాధతో తండ్రి చనిపోయాడు. తనకు తోచిన రీతిలో కర్మకాండ నిర్వహించాడు. ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన బాలుడ్ని తన కుమారుడిగా స్వీకరించాడు.
ప్రభుత్వంతో చేసిన కాంట్రాక్టుల వల్ల అవినీతి ఏ విధంగా జరుగుతుందో జోతిరావుకు తెలియవచ్చింది. బ్రాహ్మణ గుమస్తాలు ఏ విధంగా దొంగ లెక్కలు రాసి కూలీలను దోచుకుంటున్నారో ప్రత్యక్షంగా చూశాడు. అందుకే ఈ దోపిడీ అరికట్టడానికి గుమాస్తాలుగా అన్ని వర్గాల వారిని నియమించాలన్నాడు. బ్రాహ్మణుల మీద ద్వేషంతో కాక వారు చేసే అవినీతి పనుల మీద అక్కసు ఉండేది. రాత్రివేళ తీరిక సమయంలో మహారాష్ట్ర సాధువుల చరిత్రలు, సాహిత్యం చదివేవాడు. సమానత్వం, స్వేచ్ఛ, తగినబుద్ధి వంటి లక్షణాలకు కులం అడ్డంకి అని గ్రహించాడు. 1868లో తన ఇంటిలోని బావిని నిమ్నకులాలకు తెరిచాడు. దీనివల్ల తన కులం వారి నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. గ్రామ కరణాల దొంగలెక్కల్ని ఇతర అవినీతి పనుల్ని బహిరంగపరిచాడు. జోతిరావు చర్యల వల్ల అధిక వడ్డీలను నిరోధిస్తూ ప్రభుత్వం `డెక్కన్ అగ్రికల్చరిస్టు రిలీఫ్ ఏక్టు, 1879' అమలులోకి తెచ్చింది. కాలువ నీళ్ళను వ్యసాయానికి వాడడానికి ముఢనమ్మకాల వల్ల రైతులు వెనుకాడినపుడు 220 ఎకరాల భూమి కొని కాలువ నీళ్ళతో స్వయంగా వ్యవసాయం చేసి చూపించాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|