|
|
Articles: Short Stories | పోరాటం - Editor
| |
కాలేజీకి సెలవులని ఇంటికి వచ్చిన శివకు ఊరి పరిస్థితి ఆందోళనకరంగా తోచసాగింది. ఎక్కడ ఎవరిని కదిలించినా తీవ్రమైన కోపం, దు:ఖం కలగలిపి బయటకు వస్తున్నాయి ఆ సాయంత్రం అమ్మ గబగబా పని పూర్తిచేసుకొని శివను కూడా వెళ్దాం రమ్మని పిలిచింది. అంతకు ముందే నాన్న వెళ్ళాడు. అందరూ గుడి అరుగువద్ద చేరారు. ఇంతలో తన చిన్నప్పటి మిత్రులు పిలవడంతో వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. చర్చలు వాడిగా, వేడిగా సాగుతున్నాయి. ఆ సమయంలో తన తల్లిలో అంతకుముందెన్నడూ చూడని ఆవేశాన్ని ఆమె మాట్లాడుతుంటే గమనిస్తున్న శివ ఆశ్చర్యపోయాడు. బహుశా జీవితమే ఆమెకు ఎదురుతిరిగి పోరాడటాన్ని అలవాటు చేసిందేమో అనుకున్నాడు. చర్చల సారాంశమేమంటే రేపు గ్రామంలోకి భూసేకరణ కొరకు నియమించబడిన స్పెషలాఫీసర్ వస్తున్నారని, ఆయన అందరికీ నష్టపరిహారాల లిస్టు చదివి, ఖాళీ చేయమని ఇంతకు ముందే హెచ్చరించారు కనుక ఇప్పుడు ఖచ్చితంగా బలప్రయోగం చేయించడానికి పోలీసులు బలగాలతో వస్తాడని అంచనా. ఏం చెయ్యాలన్న దానికి గ్రామంలోని యువకులు, మహిళలు, రైతులు కలిసి ఒక నిర్ణయానికొచ్చి ఇళ్ళకు చేరేసరికి నడిరేయి కావస్తోంది.
వాకిట్లో మంచాలేసుకొని నడుములు వాల్చాక, ఎంతసేపటికీ శివకు నిద్ర రావడం లేదు, అటూఇటూ మెసులుతున్న కొడుకు చేతిని ఆప్యాయంగా నిమిరాడు పక్కనే ఉన్న తండ్రి..
ఇదంతా ఏంటి నాన్నా? మనకెందుకిలా అవుతోంది? ఆవేదనగా తండ్రిని అడిగాడు శివ.
ఏముందిరా తరతరాలుగా మనం నమ్ముకున్న ఈ నేలను ఎవరో ఏ దేశం నుండో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టే దొరలపాలు చెయ్యాలని దేశంలోని ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. మన భూముల విషయమే చూడు. ఇవి కొన్ని సంవత్సరానికి రెండు పంటలు పండేవి. కొన్ని వివిధ కూరగాయలు, వేరుశనగ పండే పొలాలైతే, వీటిని బలవంతంగా ఖాళీ చేయించడానికి గాను పేపర్లలోనూ, టీవీల్లోనూ పంటలు పండని బీడు భూములని ప్రచారం చేస్తున్నారు. పంటలు వేయకుండా చేయడానికి గాను కాల్వల్లో నీళ్లు వదలకుండా మనల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మన రామచంద్రం కొడుకు నీతోపాటు చదువుకున్నాడు కదా రాంబాబు, జనాన్ని వెంటేసుకొని ఇర్రిగేషన్ ఆఫీసు ఎదుట ధర్నా చేశాడు. అయినా మనకు నీళ్ళవ్వలేదు. కానీ కుర్రాళ్ళు పట్టు వదలకుండా తిరుగుతున్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎక్కడెక్కడ సెజ్ లుగా ప్రకటించబడ్డాయె ఆయా ప్రాంతాల్లో జనం ఎలా ప్రతిఘటిస్తున్నారో నిశితంగా పరిశీలిస్తున్నారు. మొన్నా మధ్యనైతే రాంబాబు, బాలకోటి వీళ్ళంతా మాలాంటి రైతుల్ని పోగుచేసి కృష్ణపట్నం, గంగవరం, పోలేపల్లి సెజ్ ఆక్రమిత ప్రాంతాలకు తీసుకెళ్ళారురా చూసివద్దాం రమ్మని. అబ్బాయ్ శివా! నిజంగా గుండె చెరువై పోయిందిరా వాళ్ళ వెతలు విని, చూసి. ఏమైనా సరే మేమెవ్వరం మన భూముల్ని మాత్రం అమ్మం, చావైనా, బతుకైనా ఇక్కడే అని గట్టిగా నిర్ణయించుకున్నాం. అక్కడెక్కడో గోవాలో మనలాంటి సామాన్యజనమే ఎదురు తిరిగి సెజ్ లను రద్దు చేయించుకున్నారన్న వార్త చదివితే, టీవీల్లో చూస్తే ఎంత సంతోషమేసిందోరా! పోన్లే అప్పుడప్పుడూ ఇలాంటి మంచి వార్తలు కూడా చూపుతారని అన్నాడు సుబ్బారావు.
ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వాలే ఇలా దళారుల్లా వ్యవహరిస్తుంటే జనం ఎన్నాళ్ళని చూస్తూ ఊరుకుంటారు నాన్నా? ఆవేశంగా ప్రశ్నించాడు శివ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|