|
|
Articles: My Thoughts | పెంచితే ... తుంచలేం! - Site Administrator
| |
1960ల్లో భూ సంస్కరణల చట్టాలు తెచ్చాయి ప్రభుత్వాలు. ఫలితంగా భూకమతాల మీద పరిమితి వచ్చింది. అధికంగా వున్న భూమిని ప్రభుత్వం తీసుకోవచ్చన్నది చట్టం. అయితే భూ సంస్కరణ చట్టంలో ఆ భూమిమీదున్న చెట్ల గురించి, ఆ చెట్ల మీద హక్కు గురించి స్పష్టంగా చెప్పలేదు. ఫలితంగా భూ సంస్కరణల చట్టం కింద భూమిని కోల్పోతున్న వారు తమ భూములలో నిలిచివున్న చెట్లను ఎందుకు వదులుకోవాలి అనుకున్నారు. ఫలితంగా ఆ చెట్లను ఇష్టం వచ్చినట్టు నరికి ఇళ్ళకు తరలించటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను ఊహించని ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చెట్ల కొట్టివేతను నిరోధించే చట్టం ఒకటి హడావుడిగా వచ్చింది. ఆ చట్టం ప్రకారం చెట్లు కొట్టేందుకు ముందు అధికారి అనుమతి తీసుకోవాలి. ఆ అధికారి ఫారెస్టు డిపార్టుమెంటుకి చెందినవాడు.
ఇక చెట్లుకొట్టాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఒక చెట్టు కొట్టాలంటే దానికి సంబంధించి దాఖలు చేయాల్సిన పత్రాల జాబితా పెరిగిపోయింది. ఇప్పుడు చెట్లు కొట్టాలంటే రెవిన్యూ రికార్డ్సులో ఆ స్థలం తమదేనన్న అంశం సాక్ష్యంగా చూపాలి. ఆ భూమి సర్వే చేసిన బొమ్మ చూపాలి. తహసిల్దార్ నుండి మరో సర్టిఫికెట్ కావాలి. ఇవన్నీ చూసి, తన ఇష్టమైతే ఫారెస్టు అధికారి అనుమతి ఇస్తాడు. అయితే ఆ సర్టిఫికెట్లు సంపాదించాలంటే ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలో, ఎంతమంది ప్రభుత్వ అధికారులకు లంచాలు సమర్పించుకోవాల్సి వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అనేక వందల రూపాయలు సమర్పించుకుంటే గాని ఒక చెట్టు కొట్టేయటానికి అనుమతి రాదు.
ఇవన్నీ భరించలేక రహస్యంగా చెట్లు కొట్టివేస్తే ఇరుగుపొరుగులు కసితో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కోర్టుల చుట్టూ తిరగాల్సి రావటం జరుగుతున్నది. అంటే తమ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఒక యజమాని అనుకుంటే, ఆ స్థలంలో ఒకవేళ ఒక చెట్టు వుంటే ఆ స్థల యజమాని తలనొప్పి అంతాయింతా కాదు. చెప్పులరిగేలా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఇటువంటి అనుభవాలను చూసిన తర్వాత కర్ణాటకలో చెట్లు పెంచనేల, తలనొప్పి తెచ్చుకోనేలా అనుకుంటున్నారు. ఆ విధంగా కొత్త చెట్లు నాటి పెంచటం ప్రోత్సాహకరమైనది కాకుండా పోయింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|