|
|
Articles: Time Pass | చెప్పు నీతి - Site Administrator
| |
(కొలనువేంకట దుర్గాప్రసాద్)
75 లక్షలకు పైగా స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల డబ్బు ఉంది. దాన్ని తీసుకొచ్చి భారత్ ని సుసంపన్నం చేస్తాం. తర్వాత అవినీతిని అంతం చేస్తాం. ఇదే మా మానీఫెస్టో... కాదు కాదు మేనిఫెస్టో! ఇది తప్ప ఇక మేం వేరే వాగ్దానాలు చెయ్యడం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగానే మా మొదటి సంతకం `అవినీతి అంతం' దస్త్రం మీదే!
అసలు అవినీతి అనేది లేకుండా వుంటే, మన ఓటర్ల జీవితాలు ఎలా వుంటాయో, వో ఐదేళ్ళు చూద్దాం అంటూ ఓటర్లు అవినీతిని అంతం చేస్తాం అన్న పార్టీకి దడదడ ఓటు ముద్ర గుద్దేశారు. ఆ పార్టీ గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మంత్రివర్గం ఏర్పాటయింది. నాయకమంత్రి నిలబడి జనసమూహానికి ఓ దస్త్రాన్ని చూపించి `ఇదే అవినీతి అంతం దస్త్రం! దీని మీద సంతకం చేస్తున్నాను. ఈ రోజు నుంచి అవినీతి మీద పోరాటం మొదలు పెడతాం. ఎలా అంతమొందించాలా అన్నది కొంత అధ్యయనం చెయ్యాల్సివుంది. దాని తర్వాత యుద్ధం మొదలెడతాం.'
జనం జేజేలు పలికారు. అమ్మయ్య! ఇహ ఎవరికీ పైసా ఇవ్వకుండా పనులు చేయించుకోవచ్చు అనుకున్నారు.
మంత్రిమండలి వాళ్ళుఏ పనీ చెయ్యకుండా, ఆ `దస్త్రం' మీదే కూర్చుని అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. పత్రికలు `ఇంకా ఎప్పుడు మొదలెడతారు అవినీతిమీద మీ పోరు?' అంటూ రాయడం మొదలెట్టాయి. ఓ సారి పత్రికా సమావేశం కూడా జరిగింది. అక్కడ ఉన్నట్టుండి ఓ విలేఖరి తన బూటుతీసి విసిరేశాడు. అందరూ నోరెళ్ళబెట్టి చూశారు. ఆ విలేఖరి వెంటనే చేతులు జోడించి `అందరూ నన్ను క్షమించాలి! నొప్పులుగా ఉన్నాయని, కాసేపు నా పాదాలను బూట్లలోంచి తీసి కూర్చున్నాను. తర్వాత బూట్లలో కాళ్ళు పెట్టాను. ఒకదాంట్లో ఎలుక దూరింది. కంగారుపడి బూటు విసిరేశానంతే!' అన్నాడు.
అంతే! నాయకమంత్రికి ఐడియా వచ్చేసింది. ఒకటి రెండ్రోజుల్లో మా ప్రభుత్వం `అవినీతిమీద యుద్ధం' అట్లా చేయబోతోందో ప్రకటిస్తాం అన్నాడు.
ఆ ఐడియా ఏమిటంటే...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|