|
|
Articles: TP Features | మృతజాతిగా మిగిలిపోదామా? - Site Administrator
| |
ఈ పరిస్థితుల్లో భాషోద్యమకారులు, భాషోద్యమ సమర్థకులు లోతుగా ఆలోచించవలసిన సంగతులున్నాయి.
ఆంగ్ల మాధ్యమం పట్ల మోజు పెరగడాన్ని విమర్శించే కంటే తెలుగు మాధ్యమం పట్ల ఆసక్తిని పెంచేందుకు ఏం చేయాలో నిర్ణయించుకొని ఆ దిశగా ఉద్యమించాలి. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా ఉన్నతవర్గాలతో సమంగా విద్య అంది తీరాలనే కోరికను తీర్చడం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యల్ని మొదలంటూ వ్యతిరేకించడం గాక, లోటుపాట్లను ఎత్తి చూపాలి. తెలుగు బోధనా స్థాయిని పెంచేందుకు, తెలుగు బోధన అన్ని స్థాయిల్లో తప్పనిసరి చేసిన 86/2003 ఉత్తర్వు అమలుకు కృషి చెయ్యాలి. ప్రజల భాషలో పాలనను ఎందుకు సాగించారనే అంశాన్ని అతి సామాన్య జనావళులలోకి తీసుకువెళ్ళాలి. దానినొక హక్కుగా జనం మధ్యలోకి తేవాలి.
భాషోద్యమానికి సంబంధించి ఇవి ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు. మన భాషా సంస్కృతుల కోసం మన ప్రభుత్వాలతోనే పోరాడవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే ప్రశ్నకు సమాధానాలు వెతకవద్దా? ఇందుకోసం మన భాషా సాంస్కృతిక గతంలోకి వెళ్ళి సమీక్షించుకోవద్దా? తెలుగు సమాజంలో పరస్పరం అపనమ్మకం, సామాజికంగా పట్టనితనం ఎందుకు చోటుచేసుకొన్నాయో తెలుసుకోవద్దా?
భాషోద్యమాలు ఈ అంశాల్లోకి వెళ్ళి, తెలుగుజాతి ఉద్యమాలుగా - నిజమైన ప్రజోద్యమాలుగా ముందుకు రాగలిగితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. అటువంటి ప్రజోద్యమాలు సమగ్ర అవగాహనతో రావాలి. ఉదాహరణకు - తెలుగుభాష ఆంగ్ల ప్రభావంతో చెడిపోతున్నదనేవారు, ఇప్పటికే అది సంస్కృత పదభూయిష్టంగా తయారయినందునే, మౌలికమైన అణచివేతకు గురై ఉన్నందునే ఈ పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని తెలుసుకోవాలి. కుల ప్రాతిపదికన చీలిపోయి ఉన్న ఈ సమాజంలో భాష విషయంలో కూడా ఎక్కువ తక్కువ భావనలు విలయతాండవం ఆడుతున్నాయని తెలుసుకోవాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|