|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
ఒకసారి తన బ్రాహ్మణ మిత్రుడి వివాహ ఊరేగింపు సందర్భంగా వారితో కలసి తను వెళ్తున్నప్పుడు, తను శూద్రుడిగా ఉండి, అటువంటి ఊరేగింపులో పాల్గొనగూడదని మిత్రుడి బంధువు చేసిన అవమానం జోతిరావును తీవ్రంగా కలచివేసింది. ఇంటికొచ్చి తండ్రితో చెప్పి ఏడ్చాడు. అప్పటి నుండి మతం పేరుతో హిందూమతంలో శూద్రులకి అతిశూద్రులకి జరుగుతున్న అవమానాల గురించి ఆలోచించి ఏ విధంగానైనా సామాజిక మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అనుకున్నాడు సామాజిక బానిసత్వం రాజకీయ బానిసత్వానికన్నా అధమమని.
ఒకే మతంలో ఉండి మనుషుల మధ్య అంతరాలు ఎందుకనుకున్నాడు. దీనికి కారణం కులాలని గ్రహించాడు. ఈ జాడ్యం పోవాలంటే విద్య ఒక ముఖ్య మార్గమనుకున్నాడు. అలాగే స్త్రీలు కూడా విద్యావంతులు కావాలనుకున్నాడు. ఈ ఆలోచనలొచ్చేటప్పటికి తన వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు. విద్యకి దూరంగా ఉన్న స్త్రీలకి ఒక పాఠశాల స్థాపించాడు. ఆ పాఠశాలలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు దొరక్కపోవడంతో, భార్యకి విద్య నేర్పి పాఠాలు చెప్పడానికి పంపించాడు. సావిత్రిబాయి పాఠశాలకు వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులు, వాళ్ళ మిత్రులు ఆమె మీద మట్టి, దుమ్ము రాళ్ళు వేసేవారు. అయినా పాఠశాలను మూయకపోతే, వాళ్ళు జోతిరావు తండ్రైన గోవిందరావు దగ్గరకు వెళ్ళి దేవుడు హాని చేస్తాడని బెదరించారు. తండ్రికి జ్యోతిరావు సర్ది చెప్పాలని చూశాడు. కాని తండ్రి వినలేదు. ఫలితంగా తండ్రి కొడుకుని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. పాఠశాల తాత్కాలికంగా మూసి వ్యాపారంలోకి దిగవలసి వచ్చింది. ఈ విధంగా స్త్రీలకు పాఠశాల స్థాపించిన భారతీయుల్లో జోతిరావు ప్రథముడు. స్త్రీజాతి ఆయనకు ఎంతో ఋణపడి ఉంది. తన పరిస్థితులు మెరుగైన తర్వాత తన బ్రాహ్మణమిత్రుల సాయంతో శూద్రులకు, అతిశూద్రులకు, స్త్రీలకు పాఠశాలను తిరిగి ప్రారంభిచాడు. ఎనిమిది మంది బాలికలతో ప్రారంభమైన పాఠశాల 48కి చేరుకుంది. విద్యావ్యాప్తికి ఆయన చేసిన కృషికిగాను ప్రభుత్వం సత్కరించింది. అప్పటికి ఆయన వయస్సు 25.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|