|
|
Articles: My Thoughts | మయుడు - Miss rajeswari rajeswarinedunuri
| |
ఇక ఆ పురాధి పతులు ఎటు కావాలంటే అటు వెళ్ళ గలరు. వాటికి రెండేసి ప్రాకారాలు వాటి నడుమ అక్కడక్కడ గోపురాలు భవనాలతో కూడిన విశాల రాజ మార్గాలు ఉన్నాయి. ఇంకా అనేక బాటలు కలిసే కూడళ్ళు అంతఃపురాలు, శివాలయాలు, కుంటలు, చెరువులు, దిగుడు బావులు, సరస్సులు, ఆరామములు, ఉద్యానాలు, రాక్షసులు వ్యాహ్యాళికి వెళ్ళడానికి అనువుగా ఉండే మనోహరమైన ప్రదేశాలు కలిగిన రమణీయ మైన త్రిపురాలను మయుడు నిర్మిం చాడు. ఐతే వీటి లో నల్లని ఉక్కుతో నిర్మించిన దానికి తారకాక్షుడు, వెండి తో నిర్మించిన దానికి విద్యున్మాలి, బంగారంతో నిర్మించిన పురానికి మయుడు అధి పతులుగా నియమింపబడ్డారు. వీరే గాక ఈ మూడు పురాలలోను వేలాది రాక్షసులు నివాసం ఉన్నారు. ఆకాశంలో ఎగిరే హంసల బారుల్లా ఏడెనిమిది అంతస్తుల అందమైన భవనాలు కూడా ఆ పురాలలో ఉండేవి. భవన నిర్మాణాలు క్రమ పద్ధతిలో ఎలా ఉండాలో పురవాసులకి ఏ ఏ సౌకర్యాలు ఎలా ఉండాలో ఆహ్లాదకర జీవన విధానానికి కావలసిన వసతులతో ఆనాడే మయుడు కేవలం మనసులో ఊహించి నిర్మించి నట్లుగా మనకు విదిత మౌతోంది. దీన్ని బట్టి ఈ నిర్మాణం వెనుక ఆకాశంలో ఎగిరే పద్ధతిలో, గొప్ప శాస్త్ర విజ్ఞానం ఇమిడి ఉందని మన పురాణ పరిశోధకులు చెబుతున్నారు.
మన పూర్వులు పుర, భవన, నిర్మాణం, లంకా నగరం వంటి కౌశలాన్ని తెలుసుకునేందుకు ఇదొక నిదర్శనం. చతుర్దశ భువనాలు రాక్షసులుండే పట్టణాలను ఇంద్ర ప్రస్థము మయ సభ శివునికి లంకా పట్టణము, పూరి జగన్నాధ దేవాలయము మయుడే నిర్మించాడట. అంతే కాదు ఊర్ధ్వ లోకాలు 7, అధోలోకాలు 7. అన్నీ మయ నిర్మింతములే. తుదకు శివుని ఆగ్రహానికి గురి ఐ కోటి సూర్య ప్రభలతో ప్రకాశించే భార్గ బాణాగ్ని లో త్రిపురాసురులు నివసించే భవనాలు ఒకే కాలంలో భగ్గుమన్నాయి.
ఖాండవ దహనంలో కృష్ణుడు, అర్జునుడు తనను ప్రాణాలతో విడిచి పెట్టినందుకు కృతజ్ఞతగా ఇంద్ర ప్రస్థము మయ సభ నిర్మించి ఇచ్చాడట. 'వీటన్నిటిని బట్టి చూస్తే మన పురాణాలు తెలిపే విజ్ఞానాలు అక్షరాల లక్షలు' అని విదితమౌతోంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|