|
|
Articles: TP Features | మహిళల పాలిట కల్పవృక్షం - Site Administrator
| |
20వ శతాబ్దంలో తెలుగుజాతికి ముఖ్యంగా మహిళలకు, బాలలకు విశిష్ట సేవలు అందించిన వారు సంఖ్యాపరంగానూ సేవల నాణ్యతా పరంగానూ అక్కడక్కడా చాలా కొద్దిమంది మాత్రమే మనకు కనిపిస్తారు. జాతికి మార్గదర్శకులై స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. సేవా కార్యక్రమాలకు తమ యావజ్జీవితాన్ని జీవన సర్వస్వాన్ని అర్పించిన వారిని వేళ్ళపై లెక్కించవచ్చును. అట్టివారిలో పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అగ్రగణ్యులని చెప్పాలి.
తన 72 ఏళ్ళ జీవిత కాలంలో 60 సంవత్సరాలు జాతికి విశిష్ట సేవలు అందించిన గొప్ప విదుషీమణి దుర్గాబాయి. బాల్యం నుండే మరీ కచ్చితంగా చెప్పాలంటే 11 సంవత్సరాల చిరు ప్రాయం నుండే దుర్గాబాయి సేవల జీవన ప్రస్థానం ప్రారంభమైంది. జులై 15, 1909న జన్మించిన దుర్గాబాయి మే 9, 1981న స్వర్గస్తురాలై ఇప్పటికి 28 సంవత్సరాలు గడిచాయి. ఇది ఆమె శతజయంతి సంవత్సరం. ఇది తెలుగు జాతికే కాక సమస్త మహిళా లోకానికీ చిరస్మరణీయమైన సంవత్సరం. భారతజాతి ప్రగతికీ, మనదేశ రాజ్యాంగ స్ఫూర్తికీ, బాలల సర్వతోముఖ వికాసానికి, మహిళాభ్యుదయానికి ఆచరణీయమైన బాటలు వేసి, చిత్తశుద్ధితో భవిష్యద్దర్శనం చేసి ఆ దిశగా కార్యక్రమాల రూపకల్పన చేసుకుని అమలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది.
11 సంవత్సరాల వయస్సులో హిందీ బాలికా పాఠశాల స్థాపనతో ప్రారంభమైన దుర్గాబాయి జీవన ప్రస్థానం ఉపాధ్యాయినిగా, ప్రిన్సిపాలుగా, ఆరోగ్య కార్యకర్తగా, సేవాకార్యక్రమాల ఆర్గనైజర్ గా, ఒక సంస్థ వ్యవస్థాపకురాలిగా తన విశిష్టత వ్యక్తిత్వంతో, ప్రవర్తనతో, నిబద్ధతతో, సేవాతత్పరతతో, వందలు, వేల మందిని ప్రభావితం చేసి తాను చేపట్టిన సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములను చేయగలగడం ఆమెకే చెల్లింది. స్వాతంత్ర్య సమర యోధురాలిగా, మహాత్మా గాంధీ అనుయాయిగా, ప్రాథమిక విద్య దగ్గరే ఆగిపోయిన తన చదువును 24 ఏళ్ళ వయస్సులో తిరిగి ప్రారంభించి మెట్రిక్, ఇంటర్, డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా అందుకునేంతగా ఎదిగింది ఆమె. ఒక ప్రభావ శీలియైన న్యాయవాదిగా, సేవా సంస్థల ఏర్పాటు రూపశిల్పిగా, సేవా సంస్థలను స్థాపించి బాలలకు, మహిళలకు సేవలు అందించడమే గాక మహిళా సాధికారతకు గట్టి పునాదులు వేసి వేనవేల మందికి తమిళనాడులోనూ అంధ్రప్రదేశ్ లోనూ బహుముఖ సేవలు అందించిన సేవలతల్లి దుర్గాబాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|